అల్లు అర్జున్ హీరోగా .. వక్కంతం వంశి దర్శకత్వంలో.. త్వరలో విడుదల కాబోతున్న ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా థియేట్రికల్ ట్రైలర్, ఈ రోజు ఉదయం విడుదలయ్యింది. అల్లు అర్జున్ ఫస్ట్ షాట్ లోనే.. ‘ఇదే నీ ఆఖరి బిరియాని.. తినేసాక, నిన్ను చంపేస్తాను.’ అని కూల్ గా డైలాగ్ చెప్పి ఆకట్టుకుంటాడు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో సైకొలాజిస్ట్ గా నటించగా, శరత్ కుమార్ మాత్రం విలన్ గా కనపడుతున్నాడు. అల్లు అర్జున్.. హీరోయిన్ అను ఇమ్మానుయేల్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, కొన్ని డాన్స్ స్టెప్ లు ట్రైలర్ లో ఆకట్టుకుంటాయి. ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ అవుతాయని, ట్రైలర్ చెపుతుంది.
రాజీవ్ రవి అందించిన కెమెరా వర్క్ బాగుంది. విశాల్ శేఖర్ సంగీతం ఒక మోస్తరుగా ఉంది. ట్రైలర్ లో వాడిన పింక్ కలర్ టోన్.. అంతగా బాగోలేదు. విలన్ అనూప్ సింగ్ ని ఒక్క షాట్ లో మాత్రమే చూపించారు. చారు హాసన్, అవిటివాడిగా సాయికుమార్ పాత్రలు.. సినిమాకి ఉపయోగపడేవి అయ్యి ఉండవచ్చు. ఈ మధ్య థియేట్రికల్ ట్రైలర్స్ బాగాలేకపోయినా.. సినిమాలు హిట్ అవుతున్నాయి ( ఫిదా, భరత్ అనే నేను). ఈ సినిమా ట్రైలర్ కూడా .. ఫస్ట్ ఇంపాక్ట్ ఇచ్చినంత , కిక్ ఇవ్వలేదు. తెర మీద అల్లు అర్జున్ ఎలా ఆడతాడో? .. పాడతాడో?.. ఎలా అలరిస్తాడో?.. మే 4 వరకు ఆగాల్సిందే. వెల్కమ్ సైనికా… !