naa-peru-surya-allu-arjunకొరటాల – ప్రిన్స్ ల ‘భరత్ అనే నేను’ ఈ నెల 20వ తేదీన విడుదల కానుండగా, 7వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఆడియో రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఇప్పటికి రెండు పాటలు విడుదల కాగా, మిగిలిన పాటలను ఈ వేడుకలో విడుదల చేస్తారు.

ఇక ‘భరత్ అనే నేను’ సినిమా రిలీజ్ కు రెండు వారాల గ్యాప్ లో అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ విడుదల కానుండగా, ఈ సినిమా ఆడియో విడుదలకు మాత్రం ఒక వారం గ్యాప్ నే ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 7న భరత్ స్వరాలు రానుండగా, 15వ తేదీన సూర్య పాటలు వినిపించడానికి సిద్ధమైనట్లుగా సమాచారం.

అయితే ఈ వేడుకను ఎక్కడ జరపాలనే దానిపై ఓ నిర్ణయానికి ఇంకా రాలేదట. ప్రస్తుత టాక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో జరపాలని భావిస్తున్నా… ఫైనల్ కు వచ్చేపాటికి ఎక్కడికి వెళ్తుందో ఇప్పుడే చెప్పలేం. తిరుపతి లేక కర్నూల్ ను వేదికలుగా అనుకుంటున్నట్లుగా లేటెస్ట్ న్యూస్.