Mumbai indians victoryప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు పటిష్టమైన రాయల్ ఛాలెంజర్స్ పై విజయం సాధించి ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి నాలుగు ఓవర్లలో పోలార్డ్, బట్లర్ విరుచుకుపడడంతో విజయాన్ని సొంతం చేసుకుంది. కీలకమైన మ్యాచ్ లో అనూహ్యమైన విజయం అందుకోవడంతో వారి ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.

దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ మరియు హోటల్ లో ప్రారంభమైంది అసలు రచ్చ. ఆల్ రౌండర్ కునాల్ పాండ్య కేక్ ను కట్ చేసి తన సంతోషాన్ని పంచుకుంటున్న సమయంలో, బౌలర్ మెక్ లింగన్ వచ్చి కేక్ ను పాండ్య ముఖానికి పూయడం, ఆ తర్వాత పాండ్య వెళ్లి పోలార్డ్ కు పూయడం, మళ్ళీ మొత్తం కేక్ ను కునాల్ ముఖానికి పూసుకుంటూ రచ్చ రచ్చ చేసారు.

తాము కోరుకున్నది దక్కగానే ఎంతటి వారైనా చిన్న పిల్లల మాదిరి మారిపోతారని ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు చెప్పకనే చెప్పారు. అయితే మిగిలిన మూడు మ్యాచ్ లలోనూ ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. ప్లే ఆఫ్స్ కు చేరుకునే జట్లలో బరిలో ఉన్న అయిదు జట్లలో ఒక్క ముంబై ఇండియన్స్ రన్ రేట్ మాత్రమే దారుణ పరిస్థితులలో ఉండడం వలన మిగిలిన మూడు మ్యాచ్ లలో కూడా విజయం తప్పనిసరి.