‘అతిలోకసుందరి’ శ్రీదేవిది హత్యేనని శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ తేల్చి చెప్పారు. విళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆదివారం పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధాంతి మాట్లాడుతూ శ్రీదేవిని ఆమె సన్నిహితులే హత్య చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ మరోమారు అధికారంలోకి వస్తుందని చెప్పగా, ఈ ఏడాది డిసెంబరులోగా సార్వత్రిక ఎన్నికలు జరిగితే ప్రధాని మోడీకి అనుకూల ఫలితాలు వస్తాయన్నారు.
గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలలో బీజేపీ ప్రాభవం బాగా తగ్గుతుందని, ఆ పార్టీ సగానికి సగం సీట్లు కోల్పోతుందన్నారు. ఏపీ, తెలంగాణలలో బీజేపీకి ఒక్క పార్లమెంటు సీటు కూడా రాదని తేల్చి చెప్పారు. ఇక రాజకీయాల్లో అడుగుపెట్టిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాణిస్తాడని ములుగు సిద్ధాంతి పంచాంగ శ్రవణంలో వివరించారు. ఇంత చెప్పిన ఈయన ఏపీ రాజకీయాల గురించి ఏం చెప్పలేదా? అంటూ విస్తుపోవడం ఏపీ ప్రజల వంతవుతోంది.