అత్యంత విజయవంతమైన మలయాళ క్రైమ్ డ్రామా దృశ్యం యొక్క సీక్వెల్ కాసేపటి క్రితం ప్రకటించారు. మోహన్ లాల్ మరియు దర్శకుడు జీతు జోసెఫ్ ఈ సినిమా కోసం మళ్ళీ కలుస్తున్నారు. దృశ్యం మలయాళంలో మొదటి 50 కోట్ల వసూళ్లు నమోదు చేసిన సినిమా. ఆ తరువాత కన్నడ, తెలుగు మరియు హిందీలలో కూడా రీమేక్ చెయ్యబడింది.
సింగల భాషలోను చైనీస్ భాషలో కూడా ఈ చిత్రం రీమేక్ చెయ్యబడింది. చైనీస్ భాషలో రీమేక్ చెయ్యబడిన మొట్టమొదటి భారతీయ సినిమా దృశ్యం. తెలుగు రీమేక్ లో వెంకటేష్, హిందీ రీమేక్ లో అజయ్ దేవగన్ నటించారు. ఈ సీక్వెల్ యొక్క అధికారిక ప్రకటన కొద్దిసేపటి క్రితం మోహన్ లాల్ యొక్క 60 వ పుట్టినరోజు స్పెషల్ గా జరిగింది.
దీనితో మోహన్ లాల్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ సీక్వెల్ ప్రాజెక్టుకు చెందిన చిన్న టీజర్ వీడియో విడుదల చేశారు. మలయాళ థ్రిల్లర్ రామ్ కోసం మోహన్ లాల్, జీతు జోసెఫ్ ఇటీవల చేతులు కలిపారు. త్రిష కృష్ణన్ హీరోయిన్ నటించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నిలిపివేయబడింది.
ఇప్పుడు ఆ స్థానంలో దృశ్యం 2 ను తీసుకుంటారు. కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సీక్వెల్ ప్రాజెక్టు కూడా మొదటి భాగం లాగే సక్సెస్ అవుతుందేమో చూడాలి. మోహన్ లాల్ చివరి సారిగా గాడ్ ఫాదర్ అనే సినిమాలో కనిపించారు.
#Drishyam #Drishyam2 pic.twitter.com/OHnue7P5uw
— Mohanlal (@Mohanlal) May 21, 2020