Mohan babu praises ntr in lepakshi utsavaluస్వర్గీయ నందమూరి తారక రామారావుతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ఎలాంటి సాన్నిహిత్యం వుందో దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. తాజాగా మరోసారి ఆ అనుభూతులను లేపాక్షి ఉత్సవాల వేదికగా మరోసారి గుర్తు చేసుకున్నారు. “రాబోయే తరాలకు నందమూరి తారక రామారావు ఫోటో చూపించి ‘శ్రీరామచంద్రుడు’ ఇతనే అంటే ఖచ్చితంగా నమ్ముతారని, ఆ విధంగా ఉంటుంది అన్న గారి స్వరూపం అని అభివర్ణించారు.

“ఏకగర్భమందు జన్మించకపోయినా మోహన్ బాబు, నేను సొదరులం” అని ఎన్టీఆర్ అన్నారని, ఎన్టీఆర్ కాషాయ వస్త్రాల నుంచి తెల్లని వస్త్రాలు ధరించడం మొదలైంది తన ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా ఫంక్షన్ నుంచేనని, ఎన్టీఆర్ తన సినిమా ‘మేజర్ చంద్రకాంత్’లో చివరిసారిగా నటించారని, తన గురించి ఎన్టీఆర్ కు ఎవరైనా ఏదయినా చెబితే, చెప్పుడు మాటలను ఆయన ఏనాడు వినేలేదని, ఎన్టీఆర్ మహోన్నతుడు, మహాపురుషుడు అని, ఆయనకు జన్మించిన వ్యక్తి బాలయ్య అని” ప్రశంసలతో ముంచెత్తారు మోహన్ బాబు.

ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉండగా, లేపాక్షిని చారిత్రాత్మక ప్రదేశంగా ప్రపంచ వ్యాప్తంగా చేసేందుకు నడుం బిగించిన ఏకైక ఎమ్మెల్యే బాలయ్య అని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ‘హ్యాట్సాఫ్’ అని బాలయ్యకు, హిందూపూర్ నియోజక వర్గ ప్రజలకు, బాలకృష్ణ అభిమానులకు కితాబిచ్చారు కలెక్షన్ కింగ్.