MLA TJR Sudhakar Babu sattires on nara Lokeshసంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకరబాబు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పై విరుచుపడ్డారు. “నాలుగు పదాలు కూడా సరిగ్గా పలకలేని లోకేష్ సీఎం వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడటమేంటి? ప్రెస్ మీట్ పెట్టి మరీ గుంటూరు, మంగళగిరి, డెంగ్యూ పదాలను లోకేష్‌ సరిగ్గా పలకాలని కోరుతున్నా,” అని ఆయన ఎద్దేవా చేసారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నలభై రోజులలో పెరిగిన కరెంటు కోతలకు, విత్తనాల కొరతకు, టీడీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులకు కూడా చంద్రబాబే కారణం అని ఆయన ఆరోపించారు.

“రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరెంటు కోతలకు కారణం తెలుగుదేశం తొత్తులు గ్రామాల్లో ఫీజులు పీకడమేమోనని అనుమానం ఉంది విద్యుత్, విత్తనాల కొరతలకి కారణం చంద్రబాబు ప్రభుత్వమే. కానీ ఏ తప్పు చెయ్యని వ్యక్తిలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఒకవేళ చంద్రబాబు మాటలు నిజమే అయితే విత్తనాల కొరతపై ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదు? ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు ఇంకా సిగ్గురాలేదు” అని ఆయన తీవ్రంగా స్పందించారు.

“ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్సార్‌ జయంతి వేడుకలకు ప్రజలలోకి వెళ్తుంటే ప్రజలు వైఎస్సార్‌ సీపీ నాయకులకు పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. అది ఓర్వలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై చంద్రబాబే దాడులు చేయించి ఎల్లో మీడియాలో ఊదరకొడుతున్నారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొన్న దొంగవు నీవు.. నువ్వెంత నీ పార్టీ ఎంత..?.” అని ఆరోపించారు. జగన్ హయంలో కూడా చంద్రబాబు ఇంతటి దుర్మార్గాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుందో మరి.