MLA Roja Fires on TDP and chandrababu naiduవైకాపా డిఫెన్స్ లో పడినప్పుడల్లా ఆ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడిను నాలుగు తిట్లు తిట్టి పబ్లిక్ దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు. దీనిట్లో ఎప్పుడూ రోజా ముందు ఉంటారు. ఇప్పుడు కాపు రేజర్వేషన్ల ఇష్యూ నుండి వైకాపాను కాపాడటానికి రోజా మళ్ళీ అలాంటి ప్రయత్నాలే చేస్తున్నట్టు కనిపిస్తున్నారు.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబుకు చిన్న మెదడు చితికిపోయి… ఏమి మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదని సెటైర్లు వేశారు. వైఎస్ జగన్ పోరాటం కారణంగానే చంద్రబాబు ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించిన రోజా… ఓటుకు నోటు కేసులో కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజీకుదిర్చానని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీయే తెలిపారన్నారు.

2 ఎకరాల ఆసామి 250 కోట్లతో ఇళ్లు ఎలా కట్టారు?… దేశంలోనే అత్యంత ధనవుంతుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా మారారు? అని ప్రశ్నించారు. తన అవినితిని కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంతో లాలూచిపడిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించిన రోజా… జగన్ పై పెట్టిన కేసులన్ని కుట్ర పూరితమైనవేనని కొట్టిపారేశారు.