Chiranjeevi Twitter handleమెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తరువాత ఒక మీడియా హౌస్‌తో మాట్లాడి తన భవిష్యత్ కమిట్మెంట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. రామ్ చరణ్ తన ఆచార్యలో అతిధి పాత్రను చేయనున్నారని, అందులో ఎటువంటి మార్పు లేదని ఆయన వెల్లడించారు. అలాగే ఆ సినిమా 2021 ఏప్రిల్ సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేస్తారని మెగాస్టార్ స్పష్టం చేశారు.

అయితే ఆచార్య సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దాని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే మనకు ఉన్న సమాచారం ప్రకారం… నవంబర్ నుండి తిరిగి పనిలోకి రావాలని బృందం చూస్తోంది. లాక్ డౌన్ కు ముందు ఆచార్య 30-40% పూర్తయింది. ఆచార్య తో పాటు తన తదుపరి రీమేక్ ప్రాజెక్టుల గురించి కూడా ఆయన స్పష్టత ఇచ్చారు.

వేదలం రీమేక్‌కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు మరియు వివి వినాయక్ మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ కోసం మెగాఫోన్‌ను పట్టుకోనున్నాడు. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తాయని ఆయన చెప్పారు. అంటే 2021లో చిరంజీవి నుండి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో రీమేక్లు ఎక్కువగా చేస్తున్నారు. తన కమ్ బ్యాక్ సినిమా… ఖైదీ నెంబర్ 150 కూడా రీమేక్ కావడం విశేషం. అందులోనూ… ఈ మూడు రీమేక్లకు వీవీ వినాయక్ నే డైరెక్టర్ గా ఎంచుకోవడం విశేషం. అంతకంటే ముందే వినాయక్ చిరంజీవి తో ఠాగూర్ వంటి మరో రీమేక్ చేశారు.