mega-star-chiranjeevi-garu-is-going-to-start-interacting-with-you-from-his-official-social-media-handlesమెగాస్టార్ చిరంజీవి రేపు ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంటర్ కాబోతున్న సంగతి తెలిసిందే. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను అభిమానులకు పంచుకునేందుకు, తన మెస్సేజ్లను ప్రజలతో పంచుకోవడానికి తాను సోషల్ మీడియాకు వస్తున్నానని చిరంజీవి ఒక చిన్న వీడియోను విడుదల చేశారు.

ఇది ఇలా ఉండగా చిరంజీవి ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఇప్పటికే లైవ్ అయ్యింది. అలవోకగా 300,000 ఫాలోయర్స్ వచ్చేశారు. రేపు ఉదయం ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ… తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా రేపు చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ కూడా ప్రారంభిస్తారని, అయితే ఫేస్బుక్ అకౌంట్ మాత్రం తరువాతి కాలంలో ఓపెన్ చేస్తారని అంటున్నారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆపేశారు. విజయవంతమైన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది.

ఈ చిత్రాన్ని ఆగస్టు 14 న స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌గా విడుదల చేయాలనేది ప్రణాళిక. విడుదలకు మంచి సమయం ఉన్నందున, ఈ ఆలస్యం దానిపై ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ చిత్రం ఎండోమెంట్స్ విభాగంలో అవినీతికి సంబంధించిన సబ్జెక్టు గురించని సమాచారం.