కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ రాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. ఇది ఇలా ఉండగా మూవీ రన్ టైం రెండు గంటల 36 నిముషాలు వచ్చినట్టు సమాచారం. మొదటి భాగం గంటా 22 నిముషాలు, రెండవ భాగం గంటా 14 నిముషాలు వచ్చినట్టు సమాచారం.

సహజంగా ఒక సినిమాను ఆడియన్స్ బోర్ ఫీల్ కాకుండా కూర్చుని ఎంజాయ్ చెయ్యాలంటే ఇది పర్ఫెక్ట్ రన్ టైం. ఈ చిత్రంలో నాగార్జున క్యారెక్టర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా ఉంటుందని.. సినిమా మొత్తంలో నాగ్ కామెడీనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. సెన్సార్ పూర్తి కావడంతో అమెరికాకు ప్రింట్స్ పంపే పనిలో ఉన్నారు నిర్మాతలు. ఇక ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాల పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిలసౌ సినిమాతో హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2006లో వచ్చిన ఒక ఫ్రెంచ్ సినిమా రీమేక్ ఇది. మన నేటివిటీకి తగ్గట్టుగా కథలో పలు మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 2016లో వచ్చిన ఊపిరి తరువాత నాగార్జునకు సరైన హిట్ లేదు. దీనితో ఆయన ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నారు.