Manchu Vishnu Mosagalluమంచు విష్ణు తన మొట్టమొదటి క్రాస్ఓవర్ చిత్రం ‘మోసగాళ్లు’ ను తెలుగు మరియు ఇంగ్లీషులో నిర్మిస్తున్నారని మన పాఠకులకు తెలుసు. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి వంటి పెద్ద పేర్లు ఉన్నాయి. కాజల్ అగర్వాల్ విష్ణు సోదరిగా కనిపించబోయే ఈ చిత్రానికి ఇంగ్లీష్ దర్శకుడు జెఫ్రీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు.

వివాహం తర్వాత కాజల్ అగర్వాల్ మొట్టమొదటి విడుదల ఇదే కావొచ్చు. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వినిపిస్తుంది. 51 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని విష్ణు రూపొందించారట. ఇది నిజం అయితే చాలా విచిత్రం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది విష్ణు మార్కెట్‌కు చాలా చాలా ఎక్కువ.

సినిమాకు హిట్ టాక్ వచ్చినా పెట్టుబడి తిరిగి రాదు. దాని కారణంగానే ఓటీటీలో విడుదలకు కూడా కుదరడం లేదు. మేకర్స్ తమ విడుదల ప్రణాళికలను ఇంకా వెల్లడించలేదు. పాండమిక్ లేకపోతే జూన్లో మోసగాళ్లు విడుదల చేయాలి. ఇండియాలో మొద‌లై అమెరికాను వ‌ణికించిన 450 మిలియ‌న్ డాల‌ర్ల అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో జరిగే సినిమా మోసగాళ్లు.

మరోవైపు… ఇటీవలే విష్ణు తన కేరీర్ లోనే అతిపెద్ద హిట్టయిన ఢీ సీక్వెల్ ప్రకటించాడు. శ్రీను వైట్ల డైరెక్షన్లో వస్తున్న ఆ సినిమాకు ఢీ & ఢీ అని నామకరణం చేశారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు మంచు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, అవరం భక్త మంచు దీనిని సమర్పించనున్నాడు.