Manchu Vishnu Chadarangam-శ్రీకాంత్ కీలక పాత్రలో మంచు విష్ణు నిర్మాణ సారథ్యంలో చదరంగం అనే ఒక వెబ్ సిరీస్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న జీ5 (జీ టీవీ డిజిటల్ ప్లేట్ ఫామ్) లో విడుదల కాబోతుంది. ఈ వెబ్ సిరీస్ విడుదలకు రెండు రోజుల ముందు దీని గురించి ఒక కీలక విషయం చెప్పారు. ఇందులో శ్రీకాంత్ ఎన్టీఆర్ గా కనిపించబోతున్నారని తెలిపారు.

“ఒక పొలిటికల్‌ డ్రామా. తన ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాలలోకి వచ్చిన ఒక నటుడు. తన లక్ష్యం కోసం ఏం చేశాడు అన్నది ఈ చదరంగం కథ. ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చాకా ఎవరికీ తెలియని ఒక విషయాన్నీ ఇందులో చెప్పబోతున్నాం,” అంటూ వారు చెప్పారు. దీనితో ఈ వెబ్ సిరీస్ పై ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.

ఎన్నికల ముందు మోహన్ బాబు కుటుంబం తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకుని ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. దీనితో ఈ వెబ్ సిరీస్ లో ఏమైనా వివాదాస్పద అంశాలు ఉంటాయా అనేది చూడాలి.

మంచు విష్ణు తన భార్య వైపు నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బంధువైన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఇటీవలే తండ్రి పోయి దుఃఖంలో ఉన్న శ్రీకాంత్ కు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం. సక్సెస్ అనేది చూసి శ్రీకాంత్ కు చాలా కాలం అయ్యింది.