2018లో మహానటి సినిమాలో ఎస్వీ రంగారావు పాత్రలో కనిపించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా సూర్య నటిస్తున్న ఆకాశం నీ హద్దురా లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు ఉదయం మోహన్బాబు చాలా రోజుల తర్వాత హీరోగా నటిస్తోన్న దేశభక్తి కథా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ ముహూర్తం జరుపుకుంది.
హైదరాబాద్లోని మోహన్బాబు నివాసంలో శుక్రవారం చిత్రీకరించిన ముహూర్తపు షాట్తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు షాట్కు విరానికా మంచు, ఐరా, అవ్రమ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, లక్ష్మీ మంచు, విద్యానిర్వాణ సంయుక్తంగా క్లాప్ నిచ్చారు. విష్ణు మంచు గౌరవ దర్శకత్వం వహించారు.
అరియానా, వివియానా సంయుక్తంగా స్క్రిప్టును డైరెక్షనల్ టీమ్కు అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సైతం ఈరోజే మొదలైంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే… మోహన్బాబు స్వయంగా స్క్రీన్ప్లే సమకూరుస్తున్నారు. డైమండ్ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాస్తున్నారు.
ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్ఫుల్ రోల్లో డాక్టర్ మోహన్బాబు నటిస్తోన్న ఈ తరహా కథ కానీ, ఈ జానర్ సినిమా కానీ ఇప్పటివరకూ టాలీవుడ్లో రాలేదని చిత్రబృందం చెప్పడం విశేషం. అలాగే ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. అలాగే మోహన్బాబుకు స్టైలిస్ట్గా విరానికా మంచు వ్యవహరిస్తుండటం విశేషం.
Started #SonofIndia today. Excited! pic.twitter.com/u3lTWXeuYV
— Mohan Babu M (@themohanbabu) October 23, 2020