Manchu Mohan Babu family supports KCR on Inter results నా బిడ్డలు, విద్యార్థులు అంటూ ఎన్నికల ముందుకు నాటకం రక్తి కట్టించి వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మంచు మోహన్ బాబు. ఈ సందర్భంగా ఆయన పుత్రరత్నాలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తెలంగాణాలో 23 మంది పిల్లలు, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అలసత్వం వల్ల ప్రాణాలు కోల్పోతే, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనిపై అన్ని వైపుల నుండి ఒత్తిడి రావడంతో ఎట్టకేలకు ఈ రోజు కేసీఆర్ ను నొప్పించకుండా అతిజాగ్రత్తగా స్పందించారు.

తెలంగాణలో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తన మనసును కలచివేసింది అంటూ, ప్రభుత్వం ఈ విషయం పై స్పందించింది.. తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది అంటూ, కేసీఆర్ మీద స్వామి భక్తిని చాటుకున్నారు మోహన్ బాబు. ఇక మోహన్ బాబు పెద్దకొడుకు, జగన్ కి బంధువు కూడా అయినా, మంచు విష్ణు ఒక ఆకు ఎక్కువే చదివారు అన్నట్టు స్పందించారు. మాకు కేసీఆర్ అంటూ భయం ఉంది అనుకుంటున్నారా అని వీర లెవెల్ లో ట్వీట్ చేసి కేసీఆర్, కేటీఆర్ మీద పొగడ్తలు కురిపించారు.

“కేటీఆర్.. ఓ ప్రో యాక్టివ్, ప్రో స్టూడెంట్ పొలిటీషియన్. కేసీఆర్ ఫ్రైర్ బ్రాండ్ అనే విషయం నేను కాదనడం లేదు. కానీ అందుకు కారణం ఉంది. కానీ ఆయన డిక్టేటర్ (నియంత) మాత్రం కాదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే.. అసలు తప్పు ఎక్కడ జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ” అంటూ తండ్రికి కోరస్ కలిపి, కేసీఆర్, కేటీఆర్ భజనతో ముగించారు. ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చే కంటే అసలు మాట్లాడకుండా ఉంటే ఇంకాస్త గౌరవంగా ఉండేదేమో