Manchu Manoj - Aham Brahmasmiయంగ్ హీరో మంచు మనోజ్ చాలా గ్యాప్ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ ఖరారు చేశాడు. ఆ సినిమాకు అహం బ్రహ్మాస్మి అనే పేరు ఖరారు చేశారు . ఒక కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రానికి మెగాఫోన్ పెట్టుకుంటున్నాడు. కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ అంతరాయం కలిగింది. మనోజ్ ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించాడు.

“ఈ లాక్ డౌన్ విరామాన్ని నేను కర్ర సాము, కత్తి యుద్ధం నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నాను. నేను ఈ సినిమా కోసం మొదటిసారి పీటర్ హెయిన్స్ తో పని చేస్తున్నాను. కేవలం ఫైట్స్ కోసమే యాభై రోజులు కేటాయించాము,” అని ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న మనోజ్ చెప్పుకొచ్చాడు. మంచు మనోజ్ ఈ చిత్రంతో నిర్మాతగా కూడా అవతారమెత్తుతున్నాడు.

అతను తన తల్లి నిర్మలా దేవి తో పాటు కొత్తగా స్థాపించిన తమ ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాబట్టి, ఈ ప్రాజెక్ట్ నటుడికి రెండు విధాలుగానూ ముఖ్యమైనది. ప్రియ భవానీ శంకర్ ఈ చిత్రానికి కథానాయిక. ఆమె శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ భారతీయుడు 2 లో కూడా నటిస్తుంది.

మనోజ్ 2017 లో వివాహం అయినప్పటి నుండి కేవలం రెండు విడుదలలు మాత్రమే చేసాడు. అతని చివరి చిత్రం 2017 లో వచ్చిన ఒక్కడు మిగిలాడు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మారింది. అప్పటి నుండి, అతను తన వ్యక్తిగత జీవితంలో సమస్యలను పరిష్కరిస్తూ సినిమాలకు దూరంగా ఉన్నాడు. విడాకుల తరువాత, నటుడు తన కెరీర్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. పెద్ద విజయంతో తిరిగి ఫామ్ లోకి రావడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు.