Malladi Vishnu - Vangaveeti Radhaగడిచిన వారం, పది రోజులుగా విజయవాడ సెంట్రల్ సీట్ పై జరిగినంత చర్చ, తెలంగాణా ఎన్నికలపై కూడా జరిగి ఉండకపోవచ్చు. తమ పార్టీ అభ్యర్ధిగా మల్లాది విష్ణును వైసీపీ ఖాయం చేయడంతో, వంగవీటి రాధా మొదలుపెట్టిన రచ్చ నానాటికి పెద్దదవుతోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా బొండాకే మళ్ళీ టిడిపి సీటు ఖాయం చేయనుంది. వైసీపీ నుండి మల్లాది విష్ణు రంగంలో ఉండగా, జనసేన తరపున ప్రస్తుతం బరిలోకి దిగడానికి ఎవరూ లేరు గానీ, వంగవీటి రాధా జనసేనలో చేరే అవకాశాలు లేకపోలేదని సమాచారం. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తరపున పోటీచేసే అవకాశం ఇస్తే, జనసేనలోకి చేరేందుకు తాను సిద్ధమన్న భావనను కోగంటి సత్యం ఇప్పటికే జనసేన వర్గీయులకు చెప్పారట.

మరో మ్యాటర్ ఏమిటంటే… అసలు జనసేనకు సెంట్రల్ నియోజకవర్గం లభించే అవకాశాలు కూడా లేవని, వామపక్షాలతో ఉండనున్న పొత్తురీత్యా, విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలను వామపక్షాలు బలంగా డిమాండ్ చేసే అవకాశం ఉందన్నది లేటెస్ట్ న్యూస్. ఇంతకీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏముంది? అంతలా ఒక్కొక్కరు ఎగబడడానికి? అన్న ఆలోచన సామాన్యులకు రావడం సహజం.