దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. పేరు, ఊరు లేని, ఎలా ఉంటాడో తెలియని శత్రువుతో చీకటి యుద్ధం చేస్తున్నాయి మన ప్రభుత్వాలు. మొదటి సారిగా 130 కోట్ల భారతీయుల్ని ఇళ్ళలోనే బందీ చేసి, దేశాన్ని అంతా స్తంభింప చేశారు. ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. పేదలు ఆకలితో అలమటిస్తున్నారు.
దారుణం ఏమిటంటే ఈ పరిస్థితి ఎప్పటివరకూ కొనసాగుతుందనేది ఎవరికీ తెలీదు. ఈ క్రమంలో ప్రభుత్వాలకు బాసటగా నిలవడానికి తెలుగు సినిమా సెలబ్రిటీలు ముందుకు వచ్చారు. తమకు తోచినట్టుగా ప్రభుత్వాలకు సహాయం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన విరాళాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
పవన్ కళ్యాణ్ – రూ. 2 కోట్లు
మహేష్ బాబు – రూ. 1 కోటి
చిరంజీవి – రూ. 1 కోటి
బాలకృష్ణ – రూ. 1 కోటి
ప్రభాస్ – రూ. 1 కోటి
రామ్ చరణ్ – రూ. 70 లక్షలు
నితిన్ – రూ. 20 లక్షలు
త్రివిక్రమ్ – రూ. 20 లక్షలు
దిల్ రాజు ఎస్వీసీ బ్యానర్ – రూ. 20 లక్షలు
కోరటాల శివ – 10 లక్షలు
సాయి ధరమ్ తేజ్ 10 లక్షలు
అనిల్ రవిపుడి – 10 లక్షలు
వివి వినాయక్ – రూ. 5 లక్షలు
నగదు రహిత విరాళాలు:
మనోజ్ మంచు
డాక్టర్ రాజశేఖర్