Mahesh-Babu-to-Get-His-Wax-Statue-at-Madame-Tussaudsఅందగాడు, కండల వీరుడు ప్రభాస్.. బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అందుకుగాను .. బ్యాంకాక్ కు చెందిన ‘ మేడం టుస్సాడ్స్ ‘ మ్యూజియం లో ప్రభాస్ మైనపు విగ్రహం పెట్టారు. దక్షిణాదిలో ఏ టాప్ హీరో కు దొరకని ఈ అరుదైన గౌరవం ప్రభాస్ కి మాత్రమే దక్కింది. లండన్ కు చెందిన ‘ మేడం టుస్సాడ్స్ ‘ మ్యూజియం లో చరిత్ర లో నిలిచిపోయిన వ్యక్తులకు, సినిమాల్లో అసాధారణ పాత్రలకు మాత్రమే దక్కే ఈ అరుదైన మైనపు గౌరవం, ఇప్పుడు మరో తెలుగు హీరో కి దక్కింది. అతడు ఎవరో కాదు .. సూపర్ స్టార్ .. మహేష్ బాబు!. అందగాడు, మనసులు కొల్లగొట్టిన పోకిరి.. మైనపు విగ్రహం .. మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో పెట్టబోతున్నారు.

తన కొలతలు తీసుకోవడానికి వచ్చిన వారితో ప్రిన్స్ హంగామా చేసాడు. తన మైనపు విగ్రహానికి పెట్టబోయే కన్ను తో మహేష్ ఇచ్చిన స్టిల్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఇది మహేష్ అభిమానులకు ఆనందం కలిగించే వార్త. దక్షిణాదిలో మైనపు విగ్రహం కలిగిన ప్రభాస్ తరువాత .. మహేషే రెండవవాడు. భరత్ అనే నేను సక్సెస్ లో ఉన్న మహేష్ బాబుకు, ఈ అరుదైన
గౌరవం దక్కడం. ఆశ్చర్యం కలిగించక మానదు. ప్రభాస్ బాహుబలిగా వేల కోట్లు వసూలు చేస్తే వచ్చిన గౌరవం, మహేష్ కు వందల కోట్లు వసూల్ చేస్తేనే వచ్చిందేంటబ్బా? ఇది ప్రిన్స్ తడాఖా !