Mahesh-Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరూ తో తన కెరీర్ బెస్ట్ హిట్ సాధించారు. కొంత గ్యాప్ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఉంటుందని మహేష్ తెలిపాడు. గతంలో వీరిద్దరూ మహర్షి చేసారు. ఆ సినిమా తరువాత వంశీ మరో సినిమా చెయ్యలేదు.

ఆ సినిమా షూటింగ్ తో ఏర్పడిన సాన్నిహిత్యంతో ఇద్దరు ఎప్పుడు కలిసి తిరిగే వారు. అయితే ఇప్పుడు ఈ సినిమా మహేష్ హోల్డ్ లో పెట్టాడని వార్తలు వస్తున్నాయి. వంశీ చెప్పిన కథ మహేష్ కు నచ్చలేదని సమాచారం. అయితే వంశీ కి కొంచెం టైం ఇచ్చి ఈలోగా గీతగోవిందం ఫేమ్ పరశురామ్ తో ఇంకో సినిమా చెయ్యాలని మహేష్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇదే జరిగితే వంశీకి పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి. మహర్షి వంటి హిట్ ఇచ్చాకా మహేష్ బాబు కోసం చాలా టైం వేస్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు మహేష్ సినిమా పోతే ఆ ప్రభావం మిగతా స్టార్ హీరోల మీద కూడా ఉంటుంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది!

మహేష్ బాబు – పరశురామ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉంది. గతంలో వారు మహేష్ తో శ్రీమంతుడు చేశారు. ఏది ఏమైనా మే నెల వరకు మహేష్ బాబు తన తదుపరి చిత్రం షూట్ మొదలు పెట్టడు. చాలా కాలం తరువాత వచ్చిన ఈ లాంగ్ బ్రేక్ ని ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.