mahesh babu vacation with familyసూపర్ స్టార్ మహేష్ బాబు గోవాలో తన సర్కారు వారి పాట షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఒక స్పెషల్ ఫ్లైట్ లో మహేష్ ఫ్యామిలీ, దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్యామిలీ, మంజుల ఫ్యామిలీ తిరిగి వస్తున్న ఫోటోలు నెట్ లో దర్శనమిచ్చాయి.

సినిమా షూటింగ్ తో పాటు ఫ్యామిలీ హాలిడే కూడా పూర్తి చేసుకుని వచ్చాడు మహేష్. అయితే ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. నిర్మాత ఖర్చులతో స్పెషల్ ఫ్లైట్లలో జల్సాలు చేస్తున్నాడు మహేష్ అంటూ విమర్శిస్తున్నారు.

అయితే సర్కారు వారి పాట టీమ్ వారు మాత్రం ఇందులో ఏ మాత్రం నిజం లేదని… వారి హాలిడే ఖర్చులు నిర్మాత ఖాతా నుండి కాకుండా సొంత ఖర్చుల నుండే పెట్టుకున్నారని అంటున్నారు.

మరో వైపు మా హీరో టాలీవుడ్ లో భారీగా ఆర్జిస్తున్న హీరో అని.. నిర్మాతల ఖర్చుల మీద జల్సాలు చేసే కర్మ పట్టలేదని అంటున్నారు. సర్కారు వారి పాట వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ప్రభాస్ రాధే శ్యామ్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, వెంకటేష్ – వరుణ్ తేజ్ ల ఎఫ్3 సినిమాలతో సంక్రాంతి బరిలో పోటీ పడబోతోంది.