Mahesh-babu-Controversy---MAAఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, తాజాగా తన బావ సుధీర్ బాబు నటించిన “నన్ను దోచుకుందువటే” సినిమాపై ట్వీట్ వేసారు. “నన్ను దోచుకుందువటే” సినిమా గురించి చాలా గొప్పగా వింటున్నానని, సొంత ప్రొడక్షన్ స్థాపించి నిర్మించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

సుధీర్ ప్రయత్నాలను చూస్తుంటే గర్వంగా ఉందని, చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు ప్రిన్స్. ప్రస్తుతం తాను జర్నీలో ఉన్నానని, మరో రెండు రోజుల్లో వస్తానని, అప్పుడు సినిమాను చూస్తానని తన బావ సినిమాపై అభిమానాన్ని చూపించారు సూపర్ స్టార్. ఇటీవల కాలంలో దాదాపుగా హిట్టయిన ప్రతి సినిమాపై ప్రిన్స్ ట్వీట్ చేస్తున్న నేపధ్యంలో… ‘నన్ను దోచుకుందువటే’ కూడా హిట్ జాబితాలోకి వెళ్తుందో లేదో చూడాలి.