Mahesh Babu - Trivikram-Srinivas
ఈ నెల ప్రారంభంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క తదుపరి ప్రాజెక్ట్ #SSMB28 అధికారిక ప్రకటనను ఆ చిత్ర నిర్మాతలు ఒక వీడియో రూపంలో విడుదల చేసింది. ఈ చిత్రం పదకొండేళ్ల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను కలుపుతుంది. వారి కలయికలో వస్తున్న మూడవ చిత్రం ఇది.

మహేష్ బాబు తన సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేసిన తర్వాత # SSMB28 సెట్స్ మీదకు వెళ్తుంది. 2022 సమ్మర్ లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ గురించి ఇప్పటికే అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. శ్రీదేవి కుమార్తె జాహ్న్వి కపూర్, దిశా పటాని మెయిన్ ఛాయస్లు అని తెలుస్తుంది.

అయితే, ఈ మధ్య తనను సంప్రదించిన తెలుగు నిర్మాతలకు జాహ్న్వి కపూర్ చుక్కలు చూపించేలా రెమ్యూనరేషన్ అడిగిందట. కాబట్టి, దిషాను రెండో ఆప్షన్ గా పెట్టుకున్నారు. ఏ కారణంగానైన వారిద్దరూ వర్క్ అవుట్ కాకపోతే త్రివిక్రమ్ పూజా హెగ్డే వైపు మొగ్గుచూపుతున్నాడట. అతని అరవింద సమేత, మరియు అల వైకుంఠపురములో సినిమాలలో నటించిన పూజా తన లక్కీ చార్మ్ గా భావిస్తున్నాడట త్రివిక్రమ్.

ఈ చిత్రం ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ముహూర్తం జరుపుకుంటుంది. ఆగష్టులో షూటింగ్ మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నారు. అయితే అదంతా కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. హారికా మరియు హాసినీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చుతున్నారు.