mahesh babu trivikram new movie సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్.. అతడు, ఖలేజా సినిమాల తరువాత తమ హాట్రిక్ కాంబినేషన్ చిత్రం కోసం పదకొండేళ్ల తర్వాత జట్టు కట్టనున్నారు. మహేష్ బాబు తన ప్రస్తుత సినిమా సర్కారు వారి పాట షూటింగ్ పూర్తయిన తర్వాత ఇప్పుడు # SSMB28 అని పిలువబడే చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది.

సమ్మర్ 2022 లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సర్కారు వారి పాట సంక్రాంతి 2022కు విడుదల అవుతుందని ఇప్పటికే ఆ నిర్మాతలు ప్రకటించారు. అంటే సర్కారు వారి పాట విడుదలకు ముందే # SSMB28 షూటింగ్ మొదలు కాబోతుందని అని క్లియర్ గా ఉంది.

చాలా సంవత్సరాలుగా, మహేష్ బాబు ఒకదాని తరువాత ఒకటి మాత్రమే సినిమాలు చేస్తున్నారు. కాబట్టి, ఇది సూపర్ స్టార్‌ కు మార్పు అవుతుంది. హారికా మరియు హాసినీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ అని వార్తలు వస్తున్నాయి.

అదే గనుక నిజమైతే త్రివిక్రమ్ తన అల వైకుంఠపురంలో టీమ్ నే తిరిగి రిపీట్ చేస్తున్నట్టు అవుతుంది. అతడు, ఖలేజా వాటివాటి కమర్షియల్ రిజల్ట్ తో సంబంధం లేకుండా మహేష్ బాబు కేరీర్ లోనే ఫ్యాన్స్ కు గుర్తుండిపోయే సినిమాలు. ఈ సారి అటువంటి సినిమాతో పాటు బాక్స్ ఆఫీసును కూడా కొల్లగొట్టాలని అభిమానులు చాలా ఆశగా ఉన్నారు.