First Tollywood Superstar Mahesh Babu To Face Camera in the Corona Crisisకరోనా సంక్షోభం లో కెమెరాను ఎదుర్కొన్న తొలి తెలుగు సూపర్ స్టార్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. ఒక యాడ్ కోసం షూటింగ్ ప్రారంభించిన ఈ నటుడు ఈ రోజు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ మొదలుపెట్టాడు. లాక్ డౌన్ తర్వాత ఇది అతని మొదటి షూట్. ఈ షూట్ రెండు రోజులు పాటు షూట్ చేస్తారు.

అవసరమైన జాగ్రత్తలు తీసుకొని, షూటింగ్ లొకేషన్ లోని ఎస్ఓపీలకు కట్టుబడి జాగ్రత్తగా షూట్ చేస్తారు. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ కోసం ఈ ప్రకటన అంటున్నారు. ఈ ప్రయత్నం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగితే అతని తదుపరి చిత్రం సర్కారు వారి పాట షూటింగ్ కూడా తొందరలో మొదలవుతుందని పలువురి అంచనా.

గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించబోతున్న చిత్రం… సర్కారు వారి పాట. ఈ చిత్రం వేసవిలో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది, కాని లాక్డౌన్ కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. మహేష్ బాబు తిరిగి షూటింగ్ మొదలుపెట్టడం వల్ల ఎక్కువ మంది తారలు యటకు వచ్చి పనిని తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.

అదే గనుక నిజమైతే సినీ కార్మికులకు మరియు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన రోజువారీ కూలీలకు ఇది శుభవార్త అవుతుంది. మరోవైపు… సర్కారు వారి పాట హీరోయిన్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రానికి థమన్ సంగీత సారథ్యం వహించబోతున్నాడు. ఈ మధ్యనే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి.