Mahesh-Babu sarkaru vaari paata“శ్రీమంతుడు” సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పలు విజయవంతమైన సినిమాలను అందించింది. చిన్న, పెద్ద హీరోలతో సినిమాలు చేస్తోన్న ఈ సంస్థ ప్రస్తుతం “పుష్ప”ను డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.

కానీ ట్రైలర్ రిలీజ్ ఆలస్యం మొదలుకుని “పుష్ప” చుట్టూ టెన్షన్ వాతావరణం నెలకొంది. ‘అఖండ’ సినిమాకు ఓవర్సీస్ లో 10 రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ కాగా, ‘పుష్ప’ రిలీజ్ కు ఇంకా 8 రోజుల సమయం ఉన్నా గానీ, ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం ‘పుష్ప’ ప్లానింగ్ తీరును సూచిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ అందిస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప.’ బహుశా ఈ స్థాయిలో డీల్ చేయకపోవడం వలనో ఏమో గానీ, తాజాగా “పుష్ప” కేంద్రంగా జరుగుతోన్న సమస్యలు, ఈ సంస్థ తదుపరి సినిమా అయిన “సర్కార్ వారి పాట”ను మరింత టెన్షన్ పెట్టిస్తోంది.

ముఖ్యంగా సూపర్ స్టార్ అభిమానులు కూడా మైత్రీ మూవీ మేకర్స్ ప్లానింగ్ పై ఒకింత గుర్రుగానే ఉన్నారు. ఇప్పటివరకు “సర్కార్ వారి పాట”కు సంబంధించి టీజర్ మినహా ఎలాంటి అప్ డేట్ లేకపోవడం, మహేష్ అభిమానుల సహనాన్ని పరీక్షించింది. చాలా సందర్భాలలో ట్రోల్స్ కూడా చేసారు.

‘అఖండ’ ప్రమోషన్స్ లో సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన సమాచారమే తప్ప, ఒక నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడడం లేదు. అలాగే “సర్కార్ వారి పాట” టీజర్ రిలీజ్ విషయంలో కూడా చిత్ర యూనిట్ వహించిన నిర్లక్ష్యం ప్రిన్స్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చవిచూసింది.

అఫీషియల్ రిలీజ్ కంటే ముందే సోషల్ మీడియాలో లీక్ కావడంతో, అర్ధరాత్రే టీజర్ ను విడుదల చేసారు. అది మొదలుకుని మొన్నటి ‘పుష్ప’ వరకు అన్నీ ఒడిదుడుకులే! దీంతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అవలంభిస్తోన్న ప్లానింగ్ లో లోపాలు బన్నీ, మహేష్ అభిమానులకు శాపాలుగా మారుతున్నాయి.