mahesh babu sarkaru vaari paata press meetప్రెస్ మీట్లలలో స్టార్స్ చేసే కామెంట్స్ ఒక్కోసారి వారికే ఎఫెక్ట్ పడేలా చేస్తాయి. మొన్నామధ్య జాన్ అబ్రహం ప్రాంతీయ సినిమాలు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పడంతో సౌత్ మీడియా అతన్ని ఆడేసుకుంది. ఇప్పుడు దాదాపు అదేవిధంగా మహేష్ కామెంట్స్ హాట్ న్యూస్ గా మారాయి. సినిమాల్లో నటించడమే కాదు నిర్మించడం కూడా నేర్చుకున్న మహేష్ కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు.

లేటెస్ట్ గా మహేష్ నిర్మిస్తున్న సినిమా మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాతగా మీడియాతో ముచ్చటించారు మహేష్. ఈ క్రమంలో మహేష్ కనిపిస్తే చాలు మీరెప్పుడు బాలీవుడ్ లో సినిమా చేస్తారని అడగటం కామనే కదా.. అలా ఓ రిపోర్టర్ అడిగేశాడు. హిందీ సినిమాలు చేసే టైం చాలా ఉంది.. తెలుగులోనే చాలా సినిమాలు చేయాలని మహేష్ కి చెప్పి చెప్పి విరక్తి పుట్టింది కాబోలు. ఈసారి వెరైటీగా నన్ను బాలీవుడ్ భరించలేదని అనేశాడు.

బాలీవుడ్ నుండి చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ నన్ను భరించడం కష్టం.. నన్ను భరించలేని ఇండస్ట్రీకి వెళ్లి సినిమాలు చేయడం టైం వేస్ట్ అని అన్నారు మహేష్. బాలీవుడ్ పరిశ్రమ తనని భరించలేదు అన్న కామెంట్ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే మహేష్ నెక్స్ట్ రాజమౌళితో చేయబోయే సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. ఆ టైం లో మహేష్ చేసిన ఈ కామెంట్స్ తో అక్కడ మీడియా ఆడేసుకునే ఛాన్స్ ఉంటుంది.

మాములుగా ఎప్పుడూ మీడియా ముందు చాలా తెలివిగా మాట్లాడే మహేష్ మేజర్ ప్రెస్ మీట్ లో మాత్రం బాలీవుడ్ పరిశ్రమ తనని భరించలేదని చేసిన కామెంట్ వేరే విధంగా వెళ్లిపోయింది. ఇక్కడ తనకంటూ విలువ, గౌరవం, ఉన్నాయని.. ఇవే సంతోషాన్ని ఇస్తున్నాయని అన్నారు మహేష్. దీన్ని విడిచి మరో ఇండస్ట్రీకి వెళ్లి పనిచేయాలనే ఆలోచన లేదని అన్నారు. రాజమౌళితో చేసే సినిమా కూడా కేవలం తెలుగు సినిమా అనుకునే మహేష్ చేస్తాడు కాబోలు అని సర్ధిచెప్పుకుంటున్నారు. అయితే ఈ కామెంట్స్ ఎంతైనా రాజమౌళి సినిమా టైం లో మాత్రం ఖచ్చితంగా మహేష్ ని టార్గెట్ అయ్యేలా చేస్తాయని చెప్పొచ్చు.