mahesh-babu-sarileru-neekevvaru-latest-updatesఅదేంటి ఫ్లైట్లలో తిరిగే మహేష్ బాబుకు ట్రైన్ తో పనేముంది అనుకుంటున్నారా? ఇది మహేష్ బాబు ప్రయాణం చెయ్యడానికి కాదు ఆయన తదుపరి చిత్రం సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ కోసం వేసే ట్రైన్ సెట్. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ లో ఒక ట్రైన్ లో జరిగే కామెడీ ట్రాక్ ఉంటుందట. మహేష్ బాబు, రష్మిక, బండ్ల గణేష్, రాజేంద్ర ప్రసాద్ పాల్గొనే ఈ సీన్ చిత్రానికే హైలైట్ అంట. దాని కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక భారీ సెట్ సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ షూటింగ్ ఆగస్టులో జరుగుతుంది.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ వీకెండ్ కాశ్మీర్ లో మొదలు అవుతుంది. ఇప్పటికే మహేష్ బాబు కాశ్మీర్ చేరుకున్నాడు. ఈ సినిమాలో మహేశ్‌ ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారని తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నంలో ఉంది చిత్ర బృందం. దీనితో ఈ చిత్రం కోసం ఎడతెరపి లేకుండా షూట్ చెయ్యబోతున్నారు. ఇది ఇలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ద్వారా సినిమాలలోకి విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు.

13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఎఫ్‌ 2 సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ సాధించిన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు, అనిల్‌ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ మొదలు కాకముందే ఈ సినిమాకు చెందిన సెట్ లైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోవడం విశేషం. మరి వచ్చే సంక్రాంతికి కూడా అనిల్ ఇంకో బ్లాక్ బస్టర్ ఇస్తాడేమో చూడాలి.