mahesh-babu- rajamouli - vikramటాప్ ఇండియన్ డైరెక్టర్స్ లో ఒకరిగా కీర్తించబడుతున్న ఎస్.ఎస్.రాజమౌళి తదుపరి సినిమా ప్రిన్స్ మహేష్ బాబుతో అన్న సంగతి తెలిసిందే. ఓ పక్కన “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్లాన్ చేస్తోన్న జక్కన్న, ప్రిన్స్ సినిమాపై కూడా కసరత్తులు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఓ క్రేజీ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేష్ కు ప్రతి నాయకుడిగా విలక్షణ నటుడు విక్రమ్ ను ఎంపిక చేస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాల్లో ఓ టాక్ హల్చల్ చేస్తోంది. ఒక నటుడిగా విక్రమ్ స్థాయి ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

తన క్యారెక్టర్ సిల్వర్ స్క్రీన్ పై పండడానికి విక్రమ్ ఏ రేంజ్ లో కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రాజమౌళి సినిమాలో ప్రతి నాయకుడిగా విక్రమ్ అంటే… మరో నట విశ్వరూపానికి తెర తీసినట్లే! ఈ క్రమంలో మహేష్ క్యారెక్టర్ పై ఫ్యాన్స్ మల్లగుల్లాలు పడుతున్నారు.

సినిమాలో హీరోయిజం పండాలంటే, ముందుగా విలనిజాన్ని హైలైట్ చేసి తద్వారా హీరోను ఒక స్థాయిలో చూపించడంలో జక్కన్న దిట్ట గనుక, విలన్ గా విక్రమ్ ను ఎంత పవర్ ఫుల్ గా చూపించినా, హీరోగా మహేష్ క్యారెక్టర్ కు ఎసరు పెట్టే అవకాశాలు లేవు. అయితే ఈ యాక్టింగ్ దిగ్గజ నటులు ఒకేసారి సిల్వర్ స్క్రీన్ ను పంచుకుంటే సినీ అభిమానులకు పండగే కదా!

యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందోనని ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.