Mahesh babu next with Vamshi Paidipallyసూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ సినిమాపై అటు అభిమానులు, ఇటు ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సరిలేరు నీకెవ్వరు తరువాత మూడు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నానని ఆయన అన్నారు. ఇక ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్నట్లు వెల్లడించారు.

వీరిద్దరి కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన మహర్షి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. మహర్షి తరువాత వంశీ ఇంకో సినిమా చెయ్యకపోవడం విశేషం. ఈ సమ్మర్‌లో ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని మహేష్ తెలిపారు. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాలో డాన్ గా కనిపించబోతున్నాడట.

ఇటువంటి పాత్ర మహేష్ బాబు చెయ్యడం ఇదే తొలి సారి. ఆ పాత్ర కోసం కొంత ఫీజిక్ కూడా మార్చబోతున్నాడట. ఆ మూడు నెల గ్యాప్ లో ఒక ట్రైనర్ ని పెట్టుకుని దాని కోసం కసరత్తు చేస్తారని అంటున్నారు. ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కూడా కొన్ని కథలను వినిపించారని మహేష్ చెప్పుకొచ్చారు.

అయితే ఆయనతో ఇంకా ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వలేదని అన్నారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటించేందుకు కూడా తాను ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ఇదే సమయంలో అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తో సినిమా లేనట్టే అని మహేష్ చెప్పకనే చెప్పాడు.