Mahesh Babu Next Vamsi paidipallyమురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న “స్పైడర్” సినిమా తర్వాత కొరటాల దర్శకత్వంలో “భరత్ అనే నేను” షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని గతంలోనే అధికారికంగా ప్రకటించాడు ప్రిన్స్. కానీ ఇటీవల రాజమౌళి పేరుతో పాటు బోయపాటి శ్రీను పేరు కూడా బలంగా వినిపించడంతో, వంశీ చిత్రంపై కాస్త సందిగ్ధత నెలకొన్న మాట వాస్తవమే. కానీ తాజాగా ప్రిన్స్ చేసిన ఓ ట్వీట్ తో వాటన్నింటికి స్వస్తి పలికినట్లయ్యింది.

వంశీ పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రిన్స్, తన తదుపరి సినిమా కోసం మీతో పని చేయడానికి ఎదురుచూస్తున్నాను… అంటూ ప్రిన్స్ చేసిన ట్వీట్ కు ధన్యవాదాలు తెలిపారు దర్శకుడు వంశీ. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి ట్విస్ట్ లు లేవని, ముందుగా అనుకున్నట్లే… మహేష్ 25వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే ఉంటుందని స్పష్టమైంది. ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్ మరియు దిల్ రాజులు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా జనవరి నుండి సెట్స్ పైకి వెళ్తుందని ఇటీవల్ దిల్ రాజు కూడా ఖరారు చేసారు.

నిజానికి ఈ గందరగోళం అంతా ఇటీవల బోయపాటి చేసిన ప్రకటనతో వచ్చింది. ప్రస్తుతం “జయ జానకి నాయక” సినిమా చేస్తున్న బోయపాటి, తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నానన్న ప్రకటనతో, వంశీ సినిమాపై సందేహాలు నెలకొన్నాయి. ఆగష్టులో బోయపాటి సినిమా విడుదల కానుందని, మిగిలిన నాలుగు నెలలు స్క్రిప్ట్ పై దృష్టి జనవరి నుండి బోయపాటి – మహేష్ ల సినిమా మొదలు కావచ్చని పుకార్లు పుట్టుకొచ్చాయి. మొత్తానికి వంశీ పుట్టినరోజు నాడు ప్రిన్స్ ఇచ్చిన కానుకగా ఈ ట్వీట్ ను పేర్కొనవచ్చు.