Mahesh Babu one day chief ministerసూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సరిలేరు నీకేవరు’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ సాధించారు. ఈ చిత్రం టాలీవుడ్ చరిత్రలో అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది. మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్లాన్ చేసిన సినిమా రద్దు కావడంతో ఇప్పుడు, మహేష్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

మరోవైపు మహేష్ బాబు తదుపరి చిత్రం గురించి ఊహాగానాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. మనకు ఉన్న సమాచారం ప్రకారం గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తో తన తదుపరి చిత్రం చెయ్యబోతున్నారు. జూలై నుండి మహేష్ బాబు ఈ సినిమా కోసం పని చేయనున్నారు. అంటే మహేష్ బాబు మూడు నెలలు ఖాళీగా ఉండనున్నారు.

ఇండస్ట్రీలో కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్స్ ఎలాగూ ఆగిపోయాయి. అదే సమయంలో పరశురామ్ కు స్క్రిప్ట్ పక్కాగా తయారు చేసుకోవడానికి మహేష్ టైం ఇవ్వాలని అనుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తారు. దీనితో మహేష్ బాబు 2020లో ఇంకో సినిమా రిలీజ్ చెయ్యాలన్న ప్లాన్ ఫలించలేదు.

కాబట్టి, మహేష్ బాబు నుండి తదుపరి సినిమా విడుదల 2021 మొదటి భాగంలో మాత్రమే చూడగలము. మహేష్ బాబు ప్రతి ఏడాది సమ్మర్ లో ఫ్యామిలీతో సహా ఏదైనా ఫారిన్ కంట్రీకి హాలిడేకి వెళ్లడం అలవాటు. అయితే ఈసారి కరోనా ఎఫెక్ట్ తో హైదరాబాద్ లోనే గడపబోతున్నాడు.