mahesh-babu-rakul-preeth-singhతమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ షెడ్యూల్ ఇటీవలే చెన్నైలో పూర్తి అయిన విషయం తెలిసిందే. మలి షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాద్ లో ప్రారంభం కానున్న నేపధ్యంలో… ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. దాదాపు 3 కోట్ల రూపాయలు విలువ చేసే ఓ భారీ యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు మురుగదాస్ ప్లాన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

కారు చేజింగ్ ల, బోట్ డ్రైవింగ్ లతో కూడిన ఈ సన్నివేశం హాలీవుడ్ రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా… హాలీవుడ్ కు చెందిన ఫైట్ మాస్టర్ తోనే రూపకల్పన చేయనున్నారని సమాచారం. ఒక విధంగా మురుగదాస్ కెరీర్ లోనే భారీ యాక్షన్ సన్నివేశంగా కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సీన్ పర్ ఫెక్ట్ గా రావడం కోసం ప్రిన్స్ కాల్షీట్స్ లో ఏకంగా 12 రోజులు ఈ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసమే వినియోగించుకోబోతున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.