Great Opportunity for Mahesh Babu's Fansప్రపంచ ప్రసిద్ధి గాంచిన ,మేడం టౌస్సాడ్స్ మ్యూజియం వారు తమ సింగపూర్ మ్యూజియం సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం పెట్టబోతున్నట్టు ప్రకటించారు. కొంత కాలం క్రిందట వారు హైదరాబాద్ వచ్చి మహేష్ బాబు కొలతలు తీసుకుని వెళ్ళారు. ఈ విగ్రహం ఇప్పుడు దాదాపుగా తయారు అయిపోయినట్టు సమాచారం. ఈ క్రమంలో విగ్రహ ఆవిష్కారణ కంటే ముందే దానిని హైదరాబాద్ లోని తమ ఏఎంబీ సినిమాస్ లో ప్రదర్శనకు ఉంచాల్సిందిగా వారిని ఒప్పించారు మహేష్ బాబు.

అదే మైన‌పు విగ్ర‌హాన్ని ఏఎంబీ సినిమాస్ లో వచ్చే నెలలో సంద‌ర్శ‌కుల వీక్ష‌ణ కోసం ప్ర‌ద‌ర్శ‌న‌కు పెడుతున్నార‌ట‌. దీనితో ఆ విగ్రహాన్ని అభిమానులు డైరెక్టుగా చూసి దానితో సెల్ఫీలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దీనితో అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. విగ్రహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. మహేశ్ బాబు ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏంఎబీ సినిమాస్ పేరిట మల్లీప్లెక్స్ ను నిర్మించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు అది హైదరాబాద్ లోనే ఫేమస్ మాల్ అయిపోయింది. ఇటీవలే కాలంలో చాలా మంది తారలు అక్కడ సినిమా చూసి పొగడ్తలతో ముంచెత్తడం మనం చూశాం. ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం 7 థియేటర్లున్నాయి. 5 స్టార్ వాతావరణంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. మొత్తం 1638 సీట్ల సామర్థ్యం ఉంది. వి.ఐ.పి లాంజ్ కూడా ఏర్పాటు చేశారు. కళ్లు మిరిమిట్లు గొలిపే అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్, లగ్జరీ థియేటర్లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. పార్టీ జోన్, వీవీఐపీ లాంజ్, స్పెషల్ కిడ్స్ జోన్, లగ్జరీ సీటింగ్ తదితర సదుపాయాలు ఏఎంబీ సినిమాస్‌లో ఉన్నాయి.