mahesh babu  kajal samantha interview“బ్రహ్మోత్సవం” పబ్లిసిటీ వారోత్సవాలు జరుపుకుంటోంది. దాదాపుగా గత నాలుగు రోజులుగా నిర్విరామంగా ప్రసారమవుతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు, కాజల్, సమంత ముగ్గురు పాల్గొన్న కార్యక్రమం వెబ్ మీడియాలో సందడి చేస్తోంది. చూడముచ్చటగా ఉన్న ఈ ఇంటర్వ్యూలో మహేష్, సమంతలు చేసిన సందడి వీక్షకులకు వినోదాన్ని పంచుతోంది.

‘సూపర్ స్టార్’ మహేష్ బాబుని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అంటూ సమంత అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘నేను నాలానే ఉంటాను’ అంటూ ప్రిన్స్ బదులిచ్చాడు. ఇక, అదే ప్రశ్నకు కాజల్ గురించి ‘బ్యూటిఫుల్’ అన్న మహేష్, సమంత గురించి చెప్పమనంగానే… ప్రదర్శించిన హావభావాలు ప్రిన్స్ లో ఉన్న ‘మాస్’ యాంగిల్ ను వెలికితీసాయి. సమంత వైపు ఓరగా చూసిన మహేష్ ఎక్స్ ప్రెషన్స్ కు సమంత కూడా మరింత రెచ్చిపోయి సిగ్గుపడుతున్నట్లు నటిస్తూ… మొత్తమ్మీద చూడముచ్చటగా ఉంది. చివరగా ‘ఈవెన్ మోర్ బ్యూటిఫుల్’ అంటూ సమాధానమిచ్చాడు ప్రిన్స్.

ఇలా సందడి సందడిగా సాగిపోయిన ఈ కార్యక్రమంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా క్లైమాక్స్ సన్నివేశం తనకు బాగా హత్తుకుందని, డబ్బింగ్ చెప్పే సమయంలో కూడా తనకు తెలియకుండా కన్నీరు వచ్చేసాయని ప్రిన్స్ చెప్పడం విశేషం. సింపుల్ కధలో మొదట కాజల్ పాత్ర కోసం పలువురి హీరోయిన్లను సంప్రదిస్తే, కనీసం కధ కూడా వినకుండా, హీరోయిన్లు ఒకరా, ఇద్దరా అంటూ వాకబు చేసారని, అయితే కధ విన్న తర్వాత కాజల్ ఒప్పుకుందని, ప్రిన్స్ చెప్పుకొచ్చారు.

పూర్తి ప్రేమకధా చిత్రం చేయాలన్న ఆకాంక్ష ఉందని, తనతో పాటు చాలా మంది అభిమానులు కూడా కోరుకుంటున్నారని మహేష్ ను సమంత అడగగా, ఈ సినిమాలో చేసినంత కూడా తన మునుపటి సినిమాలలో చేయలేదని, ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ చేశాను కదా చాలు అంటూ నవ్వులు పూయించాడు. ‘శ్రీమంతుడు’ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేయడం తన అదృష్టంగా భావించానని, దీని తర్వాత మురుగదాస్ సినిమాను చేయడం తానూ కావాలని ఎంపిక చేసుకున్నది కాదని చెప్పిన మహేష్, ‘బ్రహ్మోత్సవం’ సినిమా అందరికీ నచ్చే సినిమా అవుతుందని, ప్రత్యేకించి ఈ సినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు.