Mahesh Babu Pawan Kalyanసోషల్ మీడియాలో అభిమానుల సంఖ్యను పెంచుకోవడంలో టాలీవుడ్ అగ్ర హీరోలు ‘ల్యాండ్ మార్క్’ ఫిగర్స్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇటీవలే ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ తన ఫాలోయర్స్ 20 లక్షలు (2 మిలియన్స్)కు చేరుకోగానే, తన సైన్యానికి కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ సైన్యానికి ‘డబుల్’ ఫాలోయర్స్ ను ప్రిన్స్ మహేష్ బాబు తన సొంతం చేసుకున్నాడు.

అవును… సోషల్ మీడియాలో బాగా అరుదుగా మాత్రమే ట్వీట్లు చేసే ప్రిన్స్, తాజాగా 40 లక్షలు (4 మిలియన్స్) అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం “స్పైడర్” సినిమాకు సంబంధించి కాస్త ప్రమోషన్స్ చేస్తున్న నేపధ్యంలో 3 మిలియన్స్ నుండి 4 మిలియన్స్ కు అతి తక్కువ సమయంలో చేరుకున్నాడు. ‘స్పైడర్’ బంపర్ హిట్ అయితే 5 మిలియన్స్ ను చేరుకోవడంలో కూడా ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చు.