సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ అంతా ఒకే స్క్రీన్పై కనిపించడం ఇంతవరకు జరగలేదు. కాని ఒక యాడ్ కోసం మహేష్ బాబుతో పాటు నమ్రతా శిరోద్కర్, గౌతమ్, సితార స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యమున కిషోర్ డైరెక్షన్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం మహేష్ బాబు కుటుంబం మొత్తం యాడ్ షూట్ చేశారు.
యాడ్ పెద్దగా లేకపోయినా ఫ్యామిలీ అంతా ఒక చోట కనిపిస్తూ… చూడ ముచ్చటగా ఉన్న ఈ వీడియోని చూసి మహేష్ అభిమానులు తెగ మురిసి పోతున్నారు. మహేష్ భార్య నమ్రత ఇప్పటికే కథానాయికగా అలరించగా, గౌతమ్ 1 నేనొక్కడినే చిత్రంతో వెండితెరకి పరిచయం అయ్యాడు. ఇక సితార సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఒక్క యాడ్ కోసం మహేష్ బాబు ఏకంగా ఆరు కోట్లు ఛార్జ్ చేశారని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు యాడ్ల లో ఇదే ఎక్కువ రేటు పలికింది. కాగా, మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరింది. వచ్చే నెల మొదటి వారంలో చిత్ర బృందం కొత్త షెడ్యూల్ కు కేరళ వెళ్లబోతుంది.
సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల అల వైకుంఠపురములో కూడా అదే రోజున వస్తుంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయశాంతి ప్రత్యేక పాత్ర పోషించనుండగా, రష్మిక కథానాయికగా నటిస్తుంది.