Mahesh babu, Director Sukumar to team up again‘భరత్‌ అనే నేను’ సినిమా తరువాత, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన మహేష్ బాబు, ఇప్పుడు మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నాలుగేళ్ల క్రితం, తనతో ‘1 నేనొక్కడినే’ వంటి డీసెంట్‌ మూవీని తెరకెక్కించి, ప్రస్తుతం ‘రంగస్థలం’ సూపర్ హిట్ ను ఎంజాయ్ చేస్తున్న సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడని తెలుస్తోంది.

దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించనున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరో వారం లోపు ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. వంశీ పైడిపల్లితో చేసే సినిమాకు దాదాపు సమాంతరంగానే సుకుమార్‌ తో చేయనున్న సినిమా షూటింగ్ ఉంటుందని టాలీవుడ్ అంటోంది. అంటే, సమీప భవిష్యత్తులో మహేశ్‌ రెండు చిత్రాల షూటింగులతో ఫుల్‌ బిజీగా ఉంటాడన్న మాట.