Mahesh -Babuక్రిష్ – మహేష్ బాబు కాంబోలో “శివం” సినిమా రావాల్సి ఉందన్న విషయం బహిరంగమే. స్వయంగా రాజమౌళి కూడా ఈ సినిమా కధపై కామెంట్ చేయడంతో, “శివం” టైటిల్ కూడా బాగా హైలైట్ అయ్యింది. అయితే ఈ కాంబో కార్యరూపం దాల్చకపోవడంతో, ‘శివం’ కనుమరుగైపోయింది. ఆ తర్వాత క్రిష్, మహేష్ లు ఎవరి సినిమాలతో వారు బిజీబిజీ అయిపోయారు.

కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం…. మహేష్ బాబు – క్రిష్ ల కలయిక త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది. అల్లు అరవింద్ నిర్మాతగా ఈ సినిమా రూపుదిద్దుకోబోతోందనేది టాలీవుడ్ లేటెస్ట్ టాక్. అయితే అది గతంలో క్రిష్ చెప్పిన “శివం” సినిమానేనా? లేక మరొక కధతో ఈ ఇద్దరూ కలవబోతున్నారా? అన్నది అధికారికంగా వెల్లడి అయ్యే వరకు వేచిచూడాల్సిందే.

అన్నీ అనుకున్నట్లు కుదిరితే సుకుమార్ తర్వాత మహేష్ చేయబోయే సినిమా ఇదే అవుతుందని సమాచారం. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మహేష్ ఓ సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ, క్రిష్ రాకతో అది వెనక్కి వెళ్లిందని తెలుస్తోంది. అయితే ఇవన్నీ కూడా “మహర్షి” మరియు సుకుమార్ సినిమాలు అందించే ఫలితాల మీద కూడా ఆధారపడి ఉంటాయి.