Mahesh Babu Chief Guest for LIE movie pre Releaseఆగష్టు 11వ తేదీన బరిలో ఉన్న మూడు సినిమాలలో ఇప్పటికే బోయపాటి “జయ జానకి నాయక” మరియు రానా “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లను నిర్వహించుకున్నాయి. తాజాగా నితిన్ “లై” సినిమా కూడా అందుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకుంది. ఆగష్టు 5వ తేదీన హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ఎవరు విచ్చేయనున్నారు? ఈ ప్రశ్నకే ఇటీవల ‘మహేష్ బాబు’ అన్న సమాధానం లభించింది.

‘లై’ సినిమాను నిర్మించిన 14 రీల్స్ సంస్థకు ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న అనుబంధం తెలియనిది. అతి తక్కువ సమయంలో ఈ బ్యానర్లోనే మూడు సినిమాలు చేసిన ప్రిన్స్, ఇప్పుడు ఈ సంస్థ నిర్మించిన ‘లై’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేస్తారన్న టాక్ బలంగా వినిపించింది. సహజంగా నితిన్ సినిమాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తుంటారన్న విషయం తెలిసిందే. మరి శనివారం నాడు జరగబోతున్న ఈ వేడుకకు హాజరయ్యేది మహేష్ బాబా? పవన్ కళ్యాణా?

ఈ ఇద్దరిలో ఎవరు హాజరైనా హీరోగా నితిన్ పండగ చేసుకోవడం ఖాయం. ఎందుకంటే అంత పబ్లిసిటీ తన సినిమాకు జరుగుతుంది గనుక! కానీ ఈ వేడుకకు ఈ ఇద్దరిలో ఎవరు హాజరు కావడం లేదని సమాచారం. దీంతో మహేష్ వస్తున్నాడంటూ జరిగిన ప్రచారం ఉత్త పుకారే అని తేలిపోవడం, ఈ వార్తను అభిమానులు చాలా లైట్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ప్రిన్స్ “భరత్ అనే నేను” సినిమాతో బిజీగా ఉండగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో పవర్ స్టార్ నిమగ్నమై ఉన్నారని సమాచారం.

ఈ ఇద్దరు కాకపోయినా… ప్రస్తుతం సక్సెస్ లో ఉన్న పలువురు యువ హీరోలు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.