Mahesh-Babuసూపర్ స్టార్ మహేష్ బాబుకు బాలీవుడ్ నుండి పిలుపు వచ్చిందని సమాచారం. మహేష్ బాబు రణవీర్ సింగ్‌తో పాటు ఓ అడ్వర్టైజ్‌మెంట్ చేయడం కోసం ముంబై వెళ్లాడు. అక్కడే అడ్వర్టైజ్‌మెంట్ పూర్తయ్యాక.. బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ నాడియాద్వాలా మహేష్ బాబుకి ఒక ఆఫర్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.

రణ్ వీర్ సింగ్‌ హీరోగా చేస్తున్న ఒక సినిమా, మల్టీస్టారర్ గా చేసే ఆలోచన ఉందని, ఇంకో పాత్రకు మహేష్ కావాలని సాజిద్ నాడియాద్వాలా అడిగారట. అయితే దీనిపై మహేష్ బాబు ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే ఈ ఆఫర్ మహేష్ బాబుకి ఎంతవరకు మంచిది అనేదాని మీద చర్చ జరుగుతుంది.

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ద్వారా బాలీవుడ్ కి వెళ్లడం మంచి విషయమే. కానీ మరో స్టార్ హీరో పక్కన సినిమా అంటే, అది కూడా మొదటి సినిమాకు, అదంతా తెలివైన పని కాదనే చాలా మంది అంటున్నారు. ఇద్దరు హీరోల మధ్య బ్యాలన్స్ తీసుకురావడం, ఇప్పటికే ఉన్న స్టార్ హీరోని కాదని తన ప్రత్యేకత చాటుకోవడం అంత తేలికైన పని కాదు.

దీనితో ఈ ఆఫర్ కి మహేష్ బాబు నో చెప్పడమే బెటర్ అని ఫాన్స్ అనుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా…. మహేష్ బాబు తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లితో చెయ్యాల్సి ఉండగా… ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి కొరటాల శివ సినిమాలో ఒక కీలక పాత్ర ఆయన చెయ్యబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.