Mahesh Babu Getting Ill-Advisedప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన ‘భరత్ అనే నేను’ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తుండగా, ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

దీని తరువాత మహేశ్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ న్యూ యార్క్ లో ఎక్కువగా జరగనుంది. అందువలన అక్కడి లొకేషన్స్ ను ఎంపిక చేశారు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు తెలుస్తోంది.

అశ్వనీదత్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. మొత్తానికి వచ్చే ఏడాది మహేశ్ బాబు నుంచి రెండు సినిమాలు రానున్నాయన్న మాట. ప్రిన్స్ అభిమానులకు ఇంతకు మించిన స్వీట్ న్యూస్ మరొకటి ఉండదని చెప్పడంలో సందేహం లేదు.