Mahesh babu Bharat Ane Nenuకొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ‘భరత్ అను నేను’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం చాలాకాలం క్రితమే కొరటాల పకడ్బందీగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఒక సినిమాకు… ఈ కథకు అక్కడక్కడా పోలికలు వున్నట్టుగా గుసగుసలు వినిపిస్తూ ఉండటంతో, మార్పులు… చేర్పులకు కొరటాల సిద్ధమైనట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఇంతవరకూ చేసిన సన్నివేశాలు .. ఇక ముందు చేయవలసిన వాటి విషయంపై మహేష్ తో చర్చినట్టు సమాచారం.

అంతేకాదు ఈ చర్చల కోసం ఎడిటర్ శ్రీకర ప్రసాద్ ను కూడా పిలిపించారట. ఆయనతో కలిసి కూర్చుని చేయవలసిన మార్పులు… చేర్పులను ఖరారు చేసుకున్నారట. ఈ సినిమా కథా వస్తువు గురించి వస్తోన్న కామెంట్ల వలన మరియు ఇప్పటికే మహేష్ గత రెండు సినిమాలు బాగా దెబ్బతిని ఉండటం వలన, ‘భరత్ అనే నేను’ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుండగా, ఏప్రిల్ 27వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే.