Mahesh Babu best wishes to hyderabad sunrisersటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు క్రికెట్ ను అమితంగా ఇష్టపడతారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ అంటే మహేష్ కు అత్యంత ప్రీతిపాత్రం. సచిన్ పైన ఉన్న అభిమానంతోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో స్థానిక హైదరాబాద్ జట్టుకు కాకుండా ముంబై ఇండియన్స్ కు అభిమానిగా ఉండేవారు ప్రిన్స్. గతంలో ముంబై ఇండియన్స్ టైటిల్ ఎగురవేసిన సమయాలలో మాత్రమే తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

కానీ తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్స్ కు అర్హత సాధించిన మ్యాచ్ గురించి ప్రత్యేకంగా ట్వీట్ వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రషీద్ ఖాన్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ, సన్ రైజర్స్ కు ఫైనల్స్ కోసం శుభాకాంక్షలు చెప్తూ వేసిన ఈ ట్వీట్ తో ముంబై నుండి హైదరాబాద్ కు అభిమానిగా మహేష్ షిఫ్ట్ అయ్యారేమో అనిపించక మానదు. మహేష్ ముంబైకు సపోర్ట్ చేసినా, తనయుడు గౌతమ్ కృష్ణ మాత్రం ఎప్పుడూ సన్ రైజర్స్ మ్యాచ్ లేక్ అంకితం అయిన వైనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

క్రికెట్ ను ముఖ్యంగా ఐపీఎల్ ను మహేష్ బాగా ఫాలో అవుతారన్న విషయం ఇటీవల కేటీఆర్ తో ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టమైంది. అంతేకాదు ఈ ఐపీఎల్ లో కోట్ల రూపాయల బెట్టింగ్స్ జరుగుతాయని కూడా ప్రిన్స్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. బెట్టింగ్స్ మాట ఎలా ఉన్నా… హాట్ ఫేవరేట్ టీం ఓటమి పాలు కావడం, గెలవదు అనుకున్న టీం ఫైనల్ గా విజయం సాధించడం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పరిపాటిగా జరిగే విషయం. సన్ రైజర్స్ కూడా ఫైనల్ కు ఇలాగే చేరింది మరి!