మహర్షి సినిమా విడుదల తర్వాత విదేశాలకు వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పటికీ కుటుంబంతో కలిసి లండన్ వీధుల్లో విహరిస్తున్నాడు. ఆ మధ్య ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా చూసిన ఈయన ఇప్పుడు అక్కడ షాపింగ్ లో బిజీగా ఉన్నారు. తమతో పాటు మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కుటుంబాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు మహేష్. అది కూడా సొంత ఖర్చులతో. పైగా పైడిపల్లి కుటుంబానికి చాలా కాస్టలీ బహుమతులు కొనిపెడుతున్నాడంట మహేష్ బాబు.
మహర్షి సినిమా మహేష్ బాబు కేరీర్ లో మొట్టమొదటి 100 కోట్ల షేర్ సినిమా. సినిమా అయితే వసూళ్లు బానే రాబట్టింది గానీ పెద్ద గొప్పగా తీసింది ఏమీ లేదు. వేసవి సెలవులు కలిసి రావడం, మహేష్ బాబు చరిష్మా, బాక్స్ ఆఫీసు వద్ద పోటీ లేకపోవడం వల్ల సినిమా తన స్థాయికి మించి ఆడింది. మహేష్ బాబు మాత్రం సినిమా హిట్ అవ్వడానికి కారణం వంశీ పైడిపల్లి అనుకుని ఆయన మీద ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నాడు. ఈ విషయం ఆయన అభిమానులకు కూడా రుచించడం లేదు.
ఒక సినిమా హిట్ అయితే ఎందుకు హిట్ అయ్యింది…. ప్లాప్ అయితే ఎందుకు ప్లాప్ అయ్యింది అనేదానికి సరైన కారణం కూడా తెలుసుకోలేని అమాయకత్వమా మహేష్ బాబుది. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులలో ఇండియా తిరిగొచ్చి. ఈ నెలాఖరున కానీ వచ్చే నెల మొదట్లో గానీ తన తదుపరి చిత్రం సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ మొదలు పెడతాడు సూపర్ స్టార్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం.