Mahesh Babu Asian Cineamasటాలీవుడ్ హీరోగా అగ్ర స్థానంలో ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు, ధియేటర్ల వ్యాపార రంగంలోకి రంగంలోకి అడుగు పెట్టబోతున్న విషయం పాతదే. ఈ నెల 29వ తేదీన రిలీజ్ కాబోతున్న శంకర్ – రజనీ – అక్షయ్ ల “2.0” సినిమాతో ఈ ధియేటర్లు ప్రారంభం కానున్నాయి. ‘ఏఎంబి సినిమాస్’ పేరుతో హైదరాబాద్ లో నిర్మించిన ఈ ధియేటర్ ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్నారని ప్రచారం జరుగుతోంది.

సూపర్ స్టార్ తో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ను కూడా ప్రిన్స్ ఆహ్వానించినట్లుగా తెలుస్తుండగా, అయితే ఓ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం కోసం సూపర్ స్టార్ విచ్చేస్తారా? అంటే… మహేష్ తో వీరిద్దరికీ సత్సంబంధాలు ఉండడమే దీనికి ప్రోత్సాహాన్నిస్తోంది. ఒకవేళ వస్తే మాత్రం ‘స్వామి కార్యం… సకార్యం…’ రెండూ పూర్తవుతాయి. సిల్వర్ స్క్రీన్ పై మెరిసిపోయిన ప్రిన్స్, ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఎలా రాణిస్తారో చూడాలి.