Mahesh Babu Arrives in Mumbai‘భరత్ అనే నేను’ సినిమా సక్సెస్ ఖాయం అయిన తర్వాత ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయిన ప్రిన్స్ మహేష్ బాబు ఎట్టకేలకు ఇండియాలో ల్యాండ్ అయ్యారు. తదుపరి సినిమా కోసం గడ్డం పెంచిన విషయం ఖాయం కావడంతో, మొదటిసారిగా మహేష్ గడ్డంతో ఎలా ఉంటారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే ప్రిన్స్ ను కెమెరా కళ్ళు వదిలిపెట్టలేదు. ఫోటోలు, వీడియోలను తీయగా… మరుక్షణం అవి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యి వైరల్ అయ్యాయి. దీంతో అఫీషియల్ గా ప్రిన్స్ ఫస్ట్ లుక్ ను చూడాలనుకున్న ఫ్యాన్స్ కు ఈ వీడియోలలో ప్రిన్స్ గడ్డంతో ఎలా ఉన్నారో తెలిసిపోయింది.

ఈ వీడియోలో ప్రిన్స్ ఒక్కరే ఉన్నారు తప్ప కుటుంబ సభ్యులు కనిపించకపోవడం విశేషం. బహుశా యాడ్ షూటింగ్ లో భాగమై ప్రిన్స్ ఒక్కరే వచ్చారేమో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రిన్స్ గడ్డం లుక్ అభిమానులకు ఆనందదాయకంగా మారిందని చెప్పడంలో సందేహం లేదు. దీంతో వంశీ పైడిపల్లి సినిమాపై అంచనాలు ఇప్పటినుండే ప్రారంభం అయ్యాయి.