ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంపై పెల్లుబిక్కుతున్న కోపాన్ని పక్కదారి పట్టించేప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలోని ఆ పార్టీ అభిమానులు. రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ మాట్లాడిన ఒక వీడియోని తెచ్చి ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలని వారు చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నారు.
సదరు వీడియోలో మురళీమోహన్ దక్షిణ భారత్ లో ఉన్న ఐదు రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఇలా అయితే దక్షిణ భారతదేశాన్ని వేరే దేశంగా ప్రకటించాలనే డిమాండ్లు రావొచ్చని ఆయన అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలని చూసే ఇలాంటి వాళ్లని ఉపేక్షించకూడదని వారు అంటున్నారు.
అయితే మురళీమోహన్ నిజమైన ఆక్రోశం ఎప్పటిలానే పట్టించుకోలేదు. కేంద్రం దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తుంది అనేది ఎవరు కాదనలేని నిజం. దానికి వారి నుండి సమాధానం ఉండదు. వేర్పాటువాది పార్టీతో పొత్తు పెట్టుకుని కాశ్మీర్ ని ఏలుతూ ఇటువంటి నీతులు చెప్పడం ఒక బీజేపీ వారికే చెల్లింది.
'We 5 southern states of India will take firm decision to form seperate Country' says TDP MP Murali mohan from Andhra…@ncbn ru listening do u endorse this, if not then expel him… shame pic.twitter.com/4IlqYkTmVm
— Karunasagar Adv ⚖ (@karunasagarllb) February 14, 2018