madasu - gangadharam - Pawan kalyanకడపలో ఉక్కు కర్మాగారం పెట్టడానికి కేంద్రం నిరాకరించినా బీజేపీని ఒక మాట అనకుండా దానిని కూడా టీడీపీ ప్రభుత్వం అకౌంట్ లో వేసేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పుడు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ నేత శ్రీ మాదాసు గంగాధరం సీఎం రమేష్, బీటెక్ రవిల దీక్ష కొంగజపం అని ఆక్షేపించారు.

అక్కడితో ఆగకుండా విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం జనసేన రాజీలేని పోరాటం చేస్తోందని చెప్పారు. పవన కళ్యాణ్ కేంద్రం పై పోరాడే తీరు అందరికీ ఆదర్శం అని అన్నారు. దీనితో అక్కడ ఉన్న మీడియా వారు కంగుతిన్నారు. సరే ప్రత్యర్థి పార్టీ కాబట్టి టీడీపీ దీక్షను విమర్శించవచ్చు.

కాకపోతే అసలు ఏం చేశారని జనసేన పోరాట తీరు అందరికి ఆదర్శమో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. కేంద్రంపై పోరాటం అంటే కేంద్రం ఏంచేసినా మాట్లడకపోవడమే ఆదర్శమేమో? మరోవైపు సీఎం రమేష్, బీటెక్ రవిల దీక్ష ఏడవ రోజుకు చేరింది.