Poonam-Pandeyబాలీవుడ్ బ్యూటీ పూనం పాండే భారతీయ సినిమాల్లో బోల్డ్ హీరోయిన్లలో ఒకరు. ఈ నటి సోషల్ మీడియాలో ఘాటైన అందాల ప్రదర్శనకు ప్రసిద్ది చెందింది. అయితే తాజాగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన తరువాత ఈ నటి ఇబ్బందుల్లో పడింది. స్పష్టమైన కారణం లేకుండా ముంబై పోలీసులు ఆదివారం తన కారులో మెరైన్ డ్రైవ్‌లో మరో వ్యక్తితో కలిసి తిరగడం పోలీసులు గుర్తించారు.

ఆమె సరైన కారణం చెప్పకపోవడంతో ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో ఐపిసిలోని 188, 269, 51 (బి) సెక్షన్ల కింద పూనం పాండేపై కేసు నమోదైంది. అయితే నోటీసు ఇచ్చిన తరువాత వారిని స్టేషన్ నుండి వెళ్ళడానికి అనుమతించారు, కానీ ఆమె బిఎమ్‌డబ్ల్యూ కారు ఇప్పటికీ పోలీసుల వద్ద ఉంది.

భారతదేశంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బుక్ పొందిన మొదటి సినిమా సెలబ్రిటీ పూనం పాండే. ఈ ఉల్లంఘనకు నటి భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పూనం పాండే.. ‘ఆగయా హీరో’, ‘నషా’, ‘ద జర్నీ ఆఫ్ కర్మ’ సినిమాల్లో నటించారు. కానీ ఆమె న‌టిగా ఎక్కువ‌కాలం రాణించ‌లేక‌పోయింది.

అయితే ఆమె అందాల ఆరబోతకు అభిమానులు భారీగానే ఉన్నారు. మరోవైపు… దేశంలో నిన్న ఒక్క రోజే 4,200కు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. అందులో ఒక్క మహారాష్ట్రలోనే 2,000కు పైగా కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో మెజారిటీ కేసులు ఉన్నవి ముంబైలోనే.